Live Updates: ఈరోజు (16 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-16 01:47 GMT
Live Updates - Page 5
2020-11-16 03:59 GMT

Guntur District Updates: అమరావతి అమరేశ్వరాలయంలో కార్తీకమాస ప్రారంభ పూజలు...

 గుంటూరు ....

* కార్తీకసోమవారం కావడంతో స్వామికివారికి ప్రత్యేక అభిషేకాలు..

* కరోనా నేపధ్యంలో తగ్గిన భక్తుల రద్ధీ....

* కిృష్ణాపుష్కరిణిలో భక్తుల పుణ్యస్నానాలు నిలిపివేసిన అధికారులు...

* మాస్కులతో ధీపారాధనలు చేస్తున్న భక్తులు....

* మాస్కులు,సామాజికదూరంతో స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు...

2020-11-16 03:33 GMT

Visakha Updates: యారడాలో తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం...

విశాఖ

-యారడా తీరంలో చిక్కుకున్న ముగ్గురు యువకులు

-ఆదివారం ఆటవిడుపుగా యారడాకు వచ్చిన ఏడుగురు యువకులు

-అలల తాకిడికి తీరంలోని పిట్ల కొండ వద్ద రాళ్ళల్లో చిక్కుకున్న యువకులు

-నగరానికి చెందిన కొండ నవీన్(20)

-భీశెట్టి యశ్వంత్(20) కె.శ్రవణ్(20)

-మిగిలిన మిత్రుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పోలీసులు

-పోలీసుల ఫిర్యాదుతో రంగంలోకి రెవెన్యూ,రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ళు

-యువకులను రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేసిన అధికార యంత్రాంగం

-ఎట్టకేలకు అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో యువకులను రక్షించిన గజ ఈతగాళ్ళు

-ప్రాణాలతో తీరానికి యువకులు ఊపిరి పీల్చుకున్న అధికారులు

2020-11-16 03:23 GMT

East Godavari Updates: పిఠాపురం ప్రముఖ పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన కార్తికపూజలు..

తూర్పు గోదావరి జిల్లా... 

- కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని పిఠాపురం ప్రముఖ పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన కార్తికపూజలు..

- కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులకు ప్రత్యక ఏర్పాట్లు...

- పాదగయ పుష్కరిణిలో స్నానాలకు అనుమతి నిరాకరణ..

- కుక్కుటేశ్వర స్వామి వారికి అభిషేకాలు మరియు అమ్మవార్లకు ప్రత్యేక పూజలకు,దర్శనాలకు మాత్రమే అనుమతి..

- సామాజిక దూరంతో దర్శించుకుంటున్న భక్తులు..

- భక్తులు అంతంతమాత్రంగా రావడంతో కల తప్పిన కార్తీక మాసం..

2020-11-16 03:04 GMT

Srisailam Updates: శ్రీశైలమహాక్షేత్రంలో ప్రారంభమైన కార్తీకమాసోత్సవాలు....

  కర్నూలు జిల్లా

- కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ కార్తీకమాసోత్సవాల నిర్వహణ

- కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు

- దర్శనానికి విచ్చేసే భక్తులు ముందస్తుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి

- టైమ్‌స్లాట్ పద్దతిలో అనగా కేటాయించిన నిర్ణీత సమయాలలో దర్శనాలకు అనుమతి

- భక్తులు మాస్కును ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం తప్పనిసరి

- ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలు

- కోవిడ్ నియంత్రణలో భాగంగా స్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి

- 10 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సుగల వారికి మాత్రమే దర్శనాల అనుమతి

- కార్తీకసోమవారాలు, పౌర్ణమిరోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన మరియు పుష్కరిణి హారతి ఈరోజు పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన

- భక్తులు కార్తికదీపారాధనను చేసుకునేందుకు వీలుగా ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాటు

- తొలి కార్తీక సోమవారం అం కావడం ప్రారంభపు రోజున స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో అర కిలో మీటర్ బారులు తీరిన భక్తులు

- కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తుల దర్శనాలకు ఏర్పాట్లను చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు

2020-11-16 02:55 GMT

Anantapur District Updates: ప్రశాంతి నిలయంలో ముగిసిన అఖండ భజన...

  అనంతపురం:

* పుట్టపర్తిలో ని ప్రశాంతి నిలయంలో ముగిసిన అఖండ భజన.

* విశ్వ శాంతిని కాంక్షిస్తూ ప్రపంచ వ్యాప్తంగా సాయి భక్తుల అఖండ భజన

2020-11-16 02:54 GMT

Anantapur District Updates: ప్రముఖ శైవ క్షేత్రాల్లో కొనసాగుతున్న అభిషేకాలు, పూజలు...

  అనంతపురం:

- ప్రముఖ శైవ క్షేత్రాలు బుగ్గ రామలింగేశ్వర స్వామి, హైమావతి, లేపాక్షి పాప వినాశేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు.

- జిల్లా వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాల్లో కొనసాగుతున్న అభిషేకాలు, పూజలు

2020-11-16 02:49 GMT

Annavaram Updates: సత్యదేవుని సన్నిధిలో ప్రారంభమైన కార్తీక సందడి...

  తూర్పుగోదావరి... అన్నవరం

- తెల్లవారుజామునుండి ప్రారంభమైన వ్రతాలు....

- దర్శనాలు..

2020-11-16 02:42 GMT

Kurnool District Updates: శైవ క్షేత్రాలకు నెలవైన కర్నూలు జిల్లాలో కార్తీకమాస శోభ...

  కర్నూలు జిల్లా...

* కార్తీక మాసం తొలి రోజు మొదటి సోమవారం ఒకటే రోజు రావడంతో ఆలయాలకు వేకువజాము నుండే చేరుకుంటున్న భక్తులు

* కరోనా నేపథ్యంలో కోనేటి స్నానాలను రద్దు చేయడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న భక్తులు

* శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, కాల్వబుగ్గ ,రుద్రకోడూరు, నవనందుల కు పెరుగుతున్న భక్తుల తాకిడి

* ముందస్తుగానే భక్తుల తాకిడిని ఊహించిన అధికారులు ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేశారు

* కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులు స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవాలని... దేవస్థానం వారికి సహకరించాలని బోర్డులు సైతం ఏర్పాటు

2020-11-16 02:38 GMT

Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!

 తిరుమల సమాచారం

- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 28,780 మంది భక్తులు.

- తలనీలాలు సమర్పించిన 8,304 భక్తులు.

- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.61 కోట్లు.

2020-11-16 02:23 GMT

Rajahmundry Updates: గోదావరి పుణ్యస్నాణాలకు పోటెత్తిన భక్తులు...

  తూర్పుగోదావరి - రాజమండ్రి

- పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం, తొలి సోమవారం కావడంతో గోదావరి పుణ్యస్నాణాలకు పోటెత్తిన భక్తులు

- శివనామస్మరణతో మారుమ్రూగిన గోదావరి తీరంలోని శైవక్షేత్రాలు

- కోవిడ్ నిబంధనలతో గోదావరి రేవులలో స్నానాలు చేయరాదని నిషేధాజ్ఞలు విధించిన అధికారులు

- అయినా భక్తులు తరలివచ్చి రాజమండ్రి- పుష్కరఘాట్ , కోటిలింగాల ఘాట్లలో పుణ్యస్నాణాలు

- గోదావరిలో కార్తీకదీపాలు వదిలి ప్రత్యేక పూఝలు చేస్తున్న భక్తులు

- రాజమండ్రి- శ్రీ ఉమామార్కేండేయ స్వామి , కోటిలింగేశ్వరస్వామి ఆలయాలలో స్వామివారి దర్శనానికి బారులుతీరిన భక్తులు

- పంచారామక్షేత్రమైన సామర్లకోటలో కుమార రామ భీమేశ్వరస్వామి ఆలయయంలో, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే                దర్శనాలకు భక్తులు బారులు

-కోవిడ్ తో గోదావరి స్నానాలకు తక్కువగానే వచ్చిన భక్తులు..

Tags:    

Similar News