Pragathi Bhavan Updates: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభావన్ లో సమీక్ష...
- మధ్యాహ్నం మూడు గంటలకు కరోన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం
- 2020 - 2021 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష .
- కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ.
- ఈ సమీక్ష కు హాజరుకానున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు.
- సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం.
- సాయంత్రం ఐదు గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నిర్మాణం పై సమీక్ష.
- సమావేశానికి హాజరుకానున్న వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో .
- నిర్మాణ పనుల్లో పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.
Prakasam District Updates: బెంగళూరు నుంచి అద్దంకి వస్తున్న ఆర్టీసీ బస్సులో విషాదం...
ప్రకాశం జిల్లా..
- బెంగళూరు నుంచి అద్దంకి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మృతి....
- మృతుడు గుంటూరు జిల్లా చేజర్ల గ్రామానికి చెందిన ఏసుబాబు గా గుర్తించిన అధికారులు.
Visakha Updates: వరలక్ష్మి కేసులో ఇద్దరు యువకులు అరెస్టు...
విశాఖ
- గాజువాక వరలక్ష్మి హత్య కేసు
- కె.హరిరామకృష్ణరాజు , టి.అప్పన్న అనే ఇద్దరు యువకులు ను అరెస్టు చేసిన గాజువాక పోలీసులు
- రామ్ వద్ద అఖిల్, వరలక్ష్మి ఆమె కుటుంబం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, అన్ని గొడవలు సెటిల్ చేస్తామని చెప్పి రూ.10 వేలు డిమాండ్ చేసిన.హరి అప్పన్న
- రామును బెదిరించి 7వేలు తీసుకున్న ఇద్దరు యువకులు
Srikakulam Updates: బందరువానిపేటలో విపత్తు సన్నాహాలపై మాక్ డ్రిల్..
శ్రీకాకుళం జిల్లా..
- బందరువానిపేటలో విపత్తు సన్నాహాలపై మాక్ డ్రిల్..
-10వ ఎన్.డి.ఆర్.ఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో డ్రిల్ నిర్వహణ..
Visakha Updates: జగన్ పాద యాత్ర నిర్వహించి 3ఏళ్లు పూర్తి!
విశాఖ...
- జగన్ పాద యాత్ర నిర్వహించి 3ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా పెందుర్తి మండలం పెడగాడి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించిన విశాఖ రురల్ జిల్లా వై. ఎస్.ఆర్. పార్టీ అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు
- పాదయాత్ర కు అధికసంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు
Kadapa District Updates: దళితుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ న్యాయవాదుల నిరసన...
కడప :
-- రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కడప నగరంలోని అంభేద్కర్ సర్కిల్ లో
-- ఎస్సి, ఎస్టీ ,బీసీ మరియు మైనార్టీ న్యాయవాదుల నిరసన...
-- అంభేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన న్యాయవాదులు....
S.Vishnu Vardhan Reddy Comments: ఎస్సి, ఎస్టిలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది...
ప్రకాశం:
బి.జె.పి. నేత విష్ణువర్ధన్రెడ్డి కామెంట్స్...
-కోవిడ్ నేపధ్యంలో కేంద్రం అందిస్తున్న సాయాన్ని అందిరికీ సమానంగా పంచాల్సింది పోయి మత ప్రాతిపదికన పాస్టర్లకు 5 వేల రూపాయలు కేటాయించడం ఎస్సిలకు అన్యాయం చేయడమే...
-మతం మార్చుకుని పాస్టర్లుగా ఉంటూ ఎస్సి, ఎస్టి సర్టిఫికెట్లతో లబ్ది
-పొందుతున్నవారిపై చర్యలు తీసుకోవాలి...
-పాస్టర్లు పొందిన ఎస్సి, ఎస్టి సర్టిఫికెట్లను రద్దు చేయాలి...
-పేదలకు ఎవరికి సాయం చేసిన అభ్యంతరం లేదు...
-ఈ వ్యవహారంపై కేంద్రం విచారణకు ఆదేశించింది...
-టిటిడి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది...
-ఇతర మతాలకు చెందిన సొమ్మును ప్రభుత్వం ఇలాగే వినియోగం చేసే దైర్యం ఉందా...
-కేంద్ర ప్రభుత్వ పధకాలను పేరుమార్చి వైయస్ఆర్, జగనన్న పధకాలుగా ప్రచారం చేసుకుంటోంది...
-రాష్ట్రంలో అభివృద్ది శూన్యం... అధికారులు జగనన్న భజన చేస్తున్నారు...
-దేవాలయాలను వైయస్ఆర్ పార్టీ కార్యాలయాలుగా మార్చేస్తున్నారు.
-పోలవరం నిర్మాణం కేంద్రం చూసుకుంటుంది...
-నిధుల విషయంలో టిడిపి, వైసిపి పార్టీలకు ఏం సంబంధం...
-రెండు పార్టీలు పోలవరాన్ని ఏటియంలుగా మార్చేశారు...
-కమీషన్ల కోసం ఇరు పార్టీలు కాంట్రాక్టర్లను మార్చేశారు.
-ప్రాజెక్టు నిర్మాణం బిజెపి ప్రభుత్వం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తుంది...-
Srikakulam Updates: పోలాకి మండలంలో రెండవ రోజు సంఘీభావ యాత్ర..
శ్రీకాకుళం జిల్లా..
* పోలాకి మండలం పిన్నింటి పేట బెలమర జంక్షన్ నుంచి రెండవ రోజు సంఘీభావ యాత్ర..
* పాల్గొన్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్..
* పాదయాత్రలో పాల్గొన్న వైసిపి జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి..
Visakha Updates: నక్కపల్లి పోలీస్టేషన్ లో విషాదం....
విశాఖ...
- నక్కపల్లి పోలీస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న లేడి కానిస్టేబుల్ భవాని ఆత్మహత్య.
- పోలీస్టేషన్ ఎదురుగా ఉన్న క్వార్టర్స్ లో తన నివాసంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య.
East Godavari Updates: శనీశ్వరస్వామి ఆలయానికి విచ్చేసిన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్..
తూర్పుగోదావరి :
కొత్తపేట...
- కొత్తపేట మండలం మందపల్లి శనీశ్వరస్వామి ఆలయానికి విచ్చేసిన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్..
- స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజేంద్రప్రసాద్..