Live Updates: ఈరోజు (07 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 07 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | సప్తమి రా. 2-11 తదుపరి అష్టమి | పుష్యమి నక్షత్రం తె. 4-43 తదుపరి ఆశ్లేష | వర్జ్యం మ. 12-35 నుంచి 2-11 వరకు | అమృత ఘడియలు రా.10-16 నుంచి 11-52వరకు | దుర్ముహూర్తం ఉ. 6-04 నుంచి 7-34 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10.30 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24
ఈరోజు తాజా వార్తలు
నెల్లూరు :
-- ఒక్కసారిగా వందలాది మంది ఉద్యోగులను తొలగించాలంటూ రోడ్డెక్కిన తాత్కాలిక ఉద్యోగులు.
-- జిజిహెచ్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.
-- ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పర్యవేక్షకుల పై ఆగ్రహం.
-- జిజీ హెచ్ కి వచ్చిన రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డినీ అడ్డుకున్న తాత్కాలిక ఉద్యోగులు.
-- జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని గిరిధర్ రెడ్డి హామీ.
-- జిల్లా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని తాత్కాలిక ఉద్యోగుల బైఠాయింపు.
-- పోలీసుల రంగప్రవేశం. తాత్కాలిక ఉద్యోగులకు మధ్య వాగ్వాదం తోపులాట
-- భారీ ఎత్తున రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు దళాలు.
-- తొలగించిన తాత్కాలిక ఉద్యోగులకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు.
-- కరోనా సమయంలో విధులు నిర్వహించిన వారిని తొలగించడం అన్యాయం- మధు
-- కరోనా సమయంలో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం అన్యాయం.
-- సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా-- మధు
-- జి జీ హెచ్ తాత్కాలిక ఉద్యోగుల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా నిలుస్తాం-- మధు.
తిరుపతి
- రామానుజ సర్కిల్ వద్ద సదరన్ స్పైస్ హోటల్ లో విజిలెన్స్ అదికారుల సోదాలు
- కుళ్లిన మాంసం,ఇతర ఆహార పదార్ధాల గుర్తించిన అధికారులు
విజయవాడ
-మచిలీపట్నం స్పెషల్ సబ్ జైలులో కోవిడ్ టెస్టులు
-అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు నిందితుడు నాగేంద్ర
అమరావతి
- మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం
- మఠాధిపతి సుభుదెంద్రతీర్థ స్వామీజీ, ఫోన్ చేసి విచ్చేయ వలసిందిగా విజ్ఞప్తి
- మఠాధిపతి తరఫున పవన్ కల్యాణ్ కు ఆహ్వాన పత్రిక, రాఘవేంద్ర స్వామి తీర్థ ప్రసాదాలు అందచేత
తిరుపతి
** ఎస్వీబిసి ఛైర్మన్ యాచేంద్ర...
** శ్రీవారి ప్రాభవాన్ని దశదిశలా వ్యాపించడం కోసం వ్యవస్థీకృతమైన సంస్థలో శక్తి వంచనలేకుండా పని చేస్తాను
** స్వామివారు కల్పించిన అవకాశం, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో నాకీ అవకాశం దక్కింది
విజయవాడ
- భక్తుల రాక లేకపోవడంతో తప్పిన ప్రమాదం.
- గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకున్న పట్టించుకోని అధికారులు.
- కొండచర్యలు విరిగిపడిన కొద్దీ రోజుల్లోనే మళ్ళీ గోడలు కులడంతో అప్రమత్తమయిన అధికారులు.
అమరావతి..
బోండా ఉమా మహేశ్వర రావు
(టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్)
- 17నెలల జగన్ పాలన లో రాష్ట్రం తిరోగమనం దిశగా పోతోంది
- జగన్ పాదయాత్ర లో చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదు. అన్ని వ్యవస్థలు రివర్స్ లో వెళుతున్నాయి
- 17 నెలల్లో అంతులేని అవినీతి ఇసుక మాఫియా, మద్యం మాఫియా..ఇళ్ళ స్థలాల లో వేల కోట్లు అవినీతి జరిగింది
- పోలవరం వైసీపీ అసమర్ధత కారణం గా ఆగిపోయే పరిస్తితికి వచ్చింది
- వైసీపీ పాలనలో సామాన్యుడు బతకలేని పరిస్తితి వచ్చింది
- వైసీపీ నవరత్నాలు పేరుతో నవమోసా లు చేశారు
- 17 నెలల పాలనలో విధ్వంసాలు, కక్ష సాధింపులే మిగిలాయి
- రాష్ట్రానికి పాడి కుండ లాంటి అమరావతిని నాశనం చేశారు
తిరుపతి....
- విష్ణు నివాసంలో 24 గంటలూ సర్వదర్శనం టోకెన్లు జారీ
- భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి
- రైల్వే స్టేషన్, ఆర్టీసీబస్టాండ్ కు వచ్చే యాత్రీకులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి
- టోకెన్ల కోసం వచ్చే భక్తులు మాస్క్ ధరించి, చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచన
- సర్దర్శన టోకెన్ ద్వారా దర్శనానికి ఒకటి లేదా రెండు రోజులు పట్టే అవకాశం
- అందుకు తగ్గట్టు భక్తులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచన
విజయవాడ..
- కాపు నేస్తం పథకంలో అర్హులైన మరి కొంతమంది కి నిధులు విడుదల చేసిన మంత్రి వేణుగోపాల కృష్ణ..
- అర్హత ఉండీ గతంలో లబ్ది పొందని కాపు మహిళలకు నిధులు విడుదల..
- మొత్తం 95 వేల245 మంది లబ్ధిదారులను కొత్తగా గుర్తించిన ప్రభుత్వం..
- 142.87 కోట్ల నిధులను నగదు బదిలీ ద్వారా నేరుగా మహిళల అకౌంట్లకు జమ చేయనున్న ప్రభుత్వం...
- కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా కామెంట్స్
- మనసున్న ముఖ్యమంత్రి అని మరోసారి జగన్ నిరూపించుకున్నారు..
- అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకానికి దూరం కాకూడదని సీఎం చెప్పారు..
- కాపులందరి తరపున సీఎం జగన్ కు ధన్యవాదాలు....
పశ్చిమ గోదావరి జిల్లా: ఆచంట..
- పెనుగొండ AMC లో ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధరాజు
- ముఖ్య అతిధిలుగా పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట రమణారెడ్డి ,జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.రామరాజు