Live Updates: ఈరోజు (07 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (07 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 07 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | సప్తమి రా. 2-11 తదుపరి అష్టమి | పుష్యమి నక్షత్రం తె. 4-43 తదుపరి ఆశ్లేష | వర్జ్యం మ. 12-35 నుంచి 2-11 వరకు | అమృత ఘడియలు రా.10-16 నుంచి 11-52వరకు | దుర్ముహూర్తం ఉ. 6-04 నుంచి 7-34 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10.30 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24

ఈరోజు తాజా వార్తలు







Show Full Article

Live Updates

  • Nellore District Updates: ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఎదుట కరోనా సమయాన పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల ఆందోళన...
    7 Nov 2020 9:31 AM GMT

    Nellore District Updates: ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఎదుట కరోనా సమయాన పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల ఆందోళన...

    నెల్లూరు :

    -- ఒక్కసారిగా వందలాది మంది ఉద్యోగులను తొలగించాలంటూ రోడ్డెక్కిన తాత్కాలిక ఉద్యోగులు.

    -- జిజిహెచ్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.

    -- ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పర్యవేక్షకుల పై ఆగ్రహం.

    -- జిజీ హెచ్ కి వచ్చిన రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డినీ అడ్డుకున్న తాత్కాలిక ఉద్యోగులు.

    -- జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని గిరిధర్ రెడ్డి హామీ.

    -- జిల్లా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని తాత్కాలిక ఉద్యోగుల బైఠాయింపు.

    -- పోలీసుల రంగప్రవేశం. తాత్కాలిక ఉద్యోగులకు మధ్య వాగ్వాదం తోపులాట

    -- భారీ ఎత్తున రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు దళాలు.

    -- తొలగించిన తాత్కాలిక ఉద్యోగులకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు.

    -- కరోనా సమయంలో విధులు నిర్వహించిన వారిని తొలగించడం అన్యాయం- మధు

    -- కరోనా సమయంలో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం అన్యాయం.

    -- సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా-- మధు

    -- జి జీ హెచ్ తాత్కాలిక ఉద్యోగుల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా నిలుస్తాం-- మధు.

  • Tirumala-Tirupati Updates: విజిలెన్స్ అదికారుల సోదాలు!
    7 Nov 2020 9:28 AM GMT

    Tirumala-Tirupati Updates: విజిలెన్స్ అదికారుల సోదాలు!

    తిరుపతి

    - రామానుజ సర్కిల్‌ వద్ద సదరన్ స్పైస్ హోటల్ లో విజిలెన్స్ అదికారుల సోదాలు

    - కుళ్లిన మాంసం,ఇతర ఆహార పదార్ధాల గుర్తించిన అధికారులు

  • Vijayawada Updates: దివ్య తేజస్విని కేసు సమాచారం..
    7 Nov 2020 9:27 AM GMT

    Vijayawada Updates: దివ్య తేజస్విని కేసు సమాచారం..

     విజయవాడ

    -మచిలీపట్నం స్పెషల్ సబ్ జైలులో కోవిడ్ టెస్టులు

    -అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు నిందితుడు నాగేంద్ర

  • Amaravati Updates: ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు..
    7 Nov 2020 9:23 AM GMT

    Amaravati Updates: ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు..

      అమరావతి

    - మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం

    - మఠాధిపతి సుభుదెంద్రతీర్థ స్వామీజీ, ఫోన్ చేసి విచ్చేయ వలసిందిగా విజ్ఞప్తి

    - మఠాధిపతి తరఫున పవన్ కల్యాణ్ కు ఆహ్వాన పత్రిక, రాఘవేంద్ర స్వామి తీర్థ ప్రసాదాలు అందచేత

  • Tirumala-Tirupati Updates: టిటిడి ఎస్వీబిసి ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ విబి సాయిక్రిష్ణ యాచేంద్ర..
    7 Nov 2020 7:57 AM GMT

    Tirumala-Tirupati Updates: టిటిడి ఎస్వీబిసి ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ విబి సాయిక్రిష్ణ యాచేంద్ర..

       తిరుపతి

    ** ఎస్వీబిసి ఛైర్మన్ యాచేంద్ర...

    ** శ్రీవారి ప్రాభవాన్ని దశదిశలా వ్యాపించడం కోసం వ్యవస్థీకృతమైన సంస్థలో శక్తి వంచనలేకుండా పని చేస్తాను

    ** స్వామివారు కల్పించిన అవకాశం, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో నాకీ అవకాశం దక్కింది


  • Vijayawada Durgamma Updates: దుర్గగుడి ఆవరణలో కూలిన గోడ...
    7 Nov 2020 7:38 AM GMT

    Vijayawada Durgamma Updates: దుర్గగుడి ఆవరణలో కూలిన గోడ...

       విజయవాడ

    - భక్తుల రాక లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

    - గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకున్న పట్టించుకోని అధికారులు.

    - కొండచర్యలు విరిగిపడిన కొద్దీ రోజుల్లోనే మళ్ళీ గోడలు కులడంతో అప్రమత్తమయిన అధికారులు.

  • Amaravati Updates: జగన్ పాలన లో రాష్ట్రం తిరోగమనం దిశగా పోతోంది..
    7 Nov 2020 7:25 AM GMT

    Amaravati Updates: జగన్ పాలన లో రాష్ట్రం తిరోగమనం దిశగా పోతోంది..

     అమరావతి..

    బోండా ఉమా మహేశ్వర రావు

    (టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్)

    - 17నెలల జగన్ పాలన లో రాష్ట్రం తిరోగమనం దిశగా పోతోంది

    - జగన్ పాదయాత్ర లో చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదు. అన్ని వ్యవస్థలు రివర్స్ లో వెళుతున్నాయి

    - 17 నెలల్లో అంతులేని అవినీతి ఇసుక మాఫియా, మద్యం మాఫియా..ఇళ్ళ స్థలాల లో వేల కోట్లు అవినీతి జరిగింది

    - పోలవరం వైసీపీ అసమర్ధత కారణం గా ఆగిపోయే పరిస్తితికి వచ్చింది

    - వైసీపీ పాలనలో సామాన్యుడు బతకలేని పరిస్తితి వచ్చింది

    - వైసీపీ నవరత్నాలు పేరుతో నవమోసా లు చేశారు

    - 17 నెలల పాలనలో విధ్వంసాలు, కక్ష సాధింపులే మిగిలాయి

    - రాష్ట్రానికి పాడి కుండ లాంటి అమరావతిని నాశనం చేశారు

  • Tirumala Updates: తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త...
    7 Nov 2020 7:18 AM GMT

    Tirumala Updates: తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త...

     తిరుపతి....

    - విష్ణు నివాసంలో 24 గంటలూ సర్వదర్శనం టోకెన్లు జారీ

    - భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

    - రైల్వే స్టేషన్, ఆర్టీసీబస్టాండ్ కు వచ్చే యాత్రీకులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

    - టోకెన్ల కోసం వచ్చే భక్తులు మాస్క్ ధరించి, చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచన

    - సర్దర్శన టోకెన్ ద్వారా దర్శనానికి ఒకటి లేదా రెండు రోజులు పట్టే అవకాశం

    - అందుకు తగ్గట్టు భక్తులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచన

  • Vijayawada Updates: కాపు నేస్తం పథకంలో నిధులు విడుదల చేసిన వేణుగోపాల కృష్ణ....
    7 Nov 2020 7:16 AM GMT

    Vijayawada Updates: కాపు నేస్తం పథకంలో నిధులు విడుదల చేసిన వేణుగోపాల కృష్ణ....

     విజయవాడ..

    - కాపు నేస్తం పథకంలో అర్హులైన మరి కొంతమంది కి నిధులు విడుదల చేసిన మంత్రి వేణుగోపాల కృష్ణ..

    - అర్హత ఉండీ గతంలో లబ్ది పొందని కాపు మహిళలకు నిధులు విడుదల..

    - మొత్తం 95 వేల245 మంది లబ్ధిదారులను కొత్తగా గుర్తించిన ప్రభుత్వం..

    - 142.87 కోట్ల నిధులను నగదు బదిలీ ద్వారా నేరుగా మహిళల అకౌంట్లకు జమ చేయనున్న ప్రభుత్వం...

    - కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా కామెంట్స్

    - మనసున్న ముఖ్యమంత్రి అని మరోసారి జగన్ నిరూపించుకున్నారు..

    - అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకానికి దూరం కాకూడదని సీఎం చెప్పారు..

    - కాపులందరి తరపున సీఎం జగన్ కు ధన్యవాదాలు....

  • West Godavari Updates: ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాన్ని ప్రారంభించిన చెరుకువాడ శ్రీ రంగనాధరాజు...
    7 Nov 2020 7:13 AM GMT

    West Godavari Updates: ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాన్ని ప్రారంభించిన చెరుకువాడ శ్రీ రంగనాధరాజు...

      పశ్చిమ గోదావరి జిల్లా: ఆచంట..

    - పెనుగొండ AMC లో ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధరాజు

    - ముఖ్య అతిధిలుగా పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట రమణారెడ్డి ,జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.రామరాజు

Print Article
Next Story
More Stories