Vijayawada updates: గుడివాడ విశ్వ భారతి ప్రైవేట్ పాఠశాల వద్ద, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన..
కృష్ణాజిల్లా..
-ఆన్లైన్ పాఠాలకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణతో తల్లిదండ్రుల ధర్నా.
-ఆన్లైన్ క్లాసులకు ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులను, పాఠశాల నుండి తొలగిస్తున్నారని తల్లిదండ్రుల ఆరోపణ.
Rajahmundry updates: కేంద్రప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకవిధానాలను నిరసిస్తూ కోటగుమ్మం సెంటర్లో ధర్నా..
తూర్పుగోదావరి..రాజమండ్రి-
-- ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు నల్లా రామావు..
-కేంద్రప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకవిధానాలను నిరసిస్తూ అఖిలపక్షం కార్మిక సంఘాల
-ఆధ్వర్యంలో రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ధర్నా
-దేశవ్యాప్త పిలుపులో భాగం గా కార్మికసంఘాలు నిరసన
-42 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేవిధంగా ప్రధాని మోఢీ చట్టాలలో మార్పులు తెచ్చారని కార్మికులు నినాదాలు
-కార్మికులందరికీ ద్రోహం చేసే విధంగా కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసేలా కార్మిక చట్టాలలో మార్పులు తెచ్చారంటూ కార్మికులు నిరసన
Paripoornananda Swami Comments: నాని వెంకటేశ్వర స్వామితో ఢీకొంటున్నాడు: పరిపూర్ణానంద స్వామి..
పరిపూర్ణానంద స్వామి @ సోమాజిగూడ ప్రెస్ క్లబ్
-కేబినెట్ లో ఉన్న వ్యక్తి నాని
-రాజ్యాంగం తెలియకుండా ఎమ్మెల్యే అయ్యాడు
-రాజ్యాంగంలోని అధికరణ ప్రకారం ఎవరైనా నమ్మిన మతంపై వక్రభాష్యం చెప్తే శిక్ష పడాల్సిందే
-ఆంజనేయస్వామి వేంకటేశ్వరుడు హిందువుల సొత్తు
-నాని..ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
-హిందువులు ఓట్లేస్తేనే ఇన్ని స్థానాలు జగన్ గెలిచారు
-బ్రిటీషర్లు 42 పాయింట్స్ తో డిక్లరేషన్ ఏర్పాటు చేశారు
-హిందువులు కాని వారు దేవుడిని దర్శించుకోవాలంటే సంతకం పెట్టాలనేది డిక్లరేషన్లో ముఖ్యమైనది
-నాని నీ స్థాయి ఆంజనేయస్వామి.. వెంకటేశ్వర స్వామి స్థాయా?
-తిరుమలకొండ తో పెట్టుకున్న వారి సంగతి ఏమైందో అందరికి తెలుసు
-నాని..నీకు అహంకారం వద్దు..నాని..దేవుళ్ళ జోలికి వెళ్లకు.
-జయలలిత ఇందిరా గాంధీ లాంటి వాళ్ళు ఎలా చనిపోయ్యారో అందరికి తెలుసు
-మసీదు చర్చిలకు ఉన్న స్వయం ప్రతిపత్తి దేవాలయాలకు ఎందుకు ఇవ్వరు
-సిగ్గు లజ్జ ఉంటే ప్రభుత్వాలు దేవాలయాలను ఇచ్చెయ్యాలి
-జగన్ క్రైస్తవుడే అయినా..డిక్లరేషన్ ఇవ్వాల్సిందే
-అబ్దులు కలాం ను ఆదర్శంగా తీసుకుని జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి.
-జగన్ హిందువును అని..క్రైస్తవుడిని అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..
Andhra Pradesh High Court: గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై జవాబు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
అమరావతి..
-గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు
-పరిహారం చెల్లించకుండానే నిర్వాసితుల భూములు స్వాధీనం చేసుకున్నారని పిటిషన్ దాఖలు
-పరిహారం చెల్లించామని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ తరపు న్యాయవాది
-తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు
Visakha updates: రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల తిరుపతికి వెళ్లి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ: వంగలపూడి అనిత..
విశాఖ..
తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కామెంట్స్
-ఆ పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్లే సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి.
-టిటిడి ఆచారం ప్రకారం డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి అనే పద్ధతి 1860 నుంచి ఉంది .
-2009లో ఎం పి గా ఉన్న జగన్ తిరుమల తిరుపతి కి డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి?
-మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు దారుణం, టిటిడి డిక్లరేషన్ పై అసెంబ్లీ లో చర్చిస్తాం అని అనడం ఘోరం.
-అంతర్వేదిలో రథానికి ఇన్సూరెన్స్ ఉందా? లేదా? అని అడుగుతున్నారు అధికార పార్టీ ఎమ్యెల్యే.
-మంత్రి జయరాం బెంజి కార్ వ్యవహారం పక్కకు వెళ్ళడానికి మంత్రులు విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు.
-హిందువునైనా నన్ను కూడా హిందువు అని చూపించుకునే పరిస్థితి తెచ్చారు.
-టిటిడి సభ్యురాలిగా నేనే స్వయంగా రాజీనామా చేసాను .
-హిందు ధర్మాలు పై గౌరవం లేని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు తన పేరు మార్చుకోవాలి.
Amaravati updates: గుంటూరు లో గుర్రం జాషువా కళాప్రాంగణం నిర్మాణం పై సమీక్షిస్తున్న విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్...
అమరావతి..
-సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో జరుగుతున్న సమీక్ష.
-హాజరైన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మిపార్వతి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, అధికారులు.
-28న గుర్రం జాషువా జయంతి రోజు ఏర్పాట్లు పై సమీక్ష.
Visakha updates: వైసిపి ప్రభుత్వం లో చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు: వాసు పల్లి గణేష్ కుమార్..
విశాఖ..
-ఎమ్మెల్యే వాసు పల్లి గణేష్ కుమార్ కామెంట్స్
-మా ప్రభుత్వం లో చేయాలని అనుకున్న పథకాలన్ని కిందిస్ధాయి వరకు వైసిపి ప్రభుత్వం లో అందుతున్నాయి
-పేదల అదృష్టం వల్లనే వైసిపి ప్రభుత్వం వచ్చింది
-ప్రతిపక్ష పార్టీ సమర్ధవంతంగా పని చేయటం లేదు
-వైఎస్ జగన్ ప్రతిపక్షానికి పని లేకుండా చేశారు
-సాంకేతిక పరంగా వైసిపి కండువా వేసుకోలేను మా కుమారుడు పార్టిలో చేరాడు
Kurnool District updates: పత్తికొండలో కాంగ్రెస్ ఇంచార్జ్ క్రాంతినాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు..
కర్నూల్ జిల్లా..
-అధికార పార్టీ నాయకుల అవినీతి పై ఫేస్ బుక్ లో లో లైవ్ పెట్టిన క్రాంతి నాయుడు
-క్రాంతి నాయుడు ని ఇంటి వద్ద వెళ్లి బెదిరించిన అధికార పార్టీ కార్యకర్తలు
-దాడికి నిరసనగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపిన క్రాంతి నాయుడు
-కర్నూల్ జిల్లా పత్తికొండలో కాంగ్రెస్ ఇంచార్జ్ క్రాంతినాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు.
-అధికారపార్టీ నాయకుల అవినీతిని బట్టబయలు చేస్తే ఇంటిమీద దాడికి పాల్పడుతారా....క్రాంతి నాయుడు.
-దాడికి నిరసనగా పత్తికొండ సెంటర్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ..
-అరెస్ట్ చేసిన పత్తికొండ పోలీసులు...నా పైన దాడికి పాల్పడిన వ్యక్తులను వదిలి ..నన్ను అరెస్ట్ చేయటం ఎంత వరకు సబబు ..
-క్రాంతి నాయుడుని అరెస్ట్ చేసి పత్తికొండ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీస్ లు..
Visakha updates: రావికమతం మండలం గుమ్మల్ల పాడు గ్రామంలో దారుణం..
విశాఖ..
-దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన గ్రామస్థులు..
-దళితుల అమ్మాయి అగ్రవర్ణాల అబ్బాయిని పెళ్ళి చేసుకోవడం తో సహించలేని అగ్రవర్ణాలు
-కిరాణా గానీ పాలుగాని ఎవరైనా దళితుల అమ్మిన మాట్లాడిన ఐదు వేల రూపాయలు జరిమానా విధించిన గ్రామ పెద్దలు
-అగ్రకులాలు పెద్దలపై కేసు పెట్టిన దళిత కుటుంబాలు
Visakha updates: కూర్మన్నపాలేం బస్టాప్ వద్ద అర్దరాత్రి ఆటోలో బలవంతంగా ఇద్దరు అమ్మాయిలను ఆటోలో ఎక్కించిన ముగ్గురు వ్యక్తులు..
విశాఖ..
-మార్గమద్యలో ఇద్దరు అమ్మాయిలు ఆటో నుండి దూకేయటంతో స్వల్ప గాయాలు
-గాజువాక నైట్ బిట్ కు దొరిన ఆటో ముగ్గురు వ్యక్తులు
-గాజువాక పోలీస్టేషనుకు తరిలింపు..