ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు తాజావార్తలు
▪️YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా డా.బుచ్చిపుడి సాంబశివరెడ్డి నియామకం.
▪️నూతనంగా ఎంపికైన సాంబశివ రెడ్డికి నెలకు రూ. 2 లక్షల వేతనంతో పాటు ఇతర అలవెన్సులు కలిపి రూ.3,82,000 ప్రభుత్వం చెల్లించనుంది.
- ఎమ్మెల్సీ కొడుకునంటూ పరిచయం చేసుకున్న భరత్..
- 15 లక్షల రూపాయలు ఇవ్వాలని లేదంటే ఫొటోస్ సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరింపు కాల్స్...
- మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆవేదన.
- నాలుగు నెలల క్రితం ఎమ్మెల్సీ కొడుకు అని చెప్పి పరిచయం అయిన నోముల భరత్ గౌడ్.
- పరిచయం అనంతరం పలు వేధింపులకు గురైన యువతి , చివరకు పోలీసులకు ఫిర్యాదు.
- పోచంపల్లి గ్రామానికి చెందిన నిందితుడు నోముల భరత్ గౌడ్ పై పలు సెక్షన్ ల కింద కేస్ నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
-జీహెచ్ఎంసీ పరిధి నుంచే 33 కేసులు వచ్చాయి.
-ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 19 మందికి పాజిటివ్.
-తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1813కి చేరింది.
-కరోనాతో పోరాడి ఇప్పటివరకు 49మంది చనిపోయారు.
- ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను 2019 బ్యాచ్ ఏపీ కేడర్కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్లు మర్యాదపూర్వకంగా కలిశారు.
-ఈ సందర్భంగా యువ ఐఏఎస్ అధికారులను సీఎం అభినందించారు.
- నిబద్ధత గల అధికారులుగా ప్రజలకు మంచి సేవలందిండం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్న సీఎం ఆకాంక్షిచారు.
- మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కొత్త వరిపేట గ్రామంలో రూ. 82,500 విలువ గల 50 కిలోల నిషిదిత నకిలీ పత్తి విత్తనాల స్వాధీనం.
- ఒకరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.
- మహారాష్ట్రలో గత 24 గంటల్లో కరోనావైరస్ కారణంగా 63 మంది మరణించారు.
- రాష్ట్రంలో మరణాల సంఖ్య 1517 కు చేరింది.
- అదే సమయంలో దేశంలో ఇప్పటివరకు 3 వేల 583 మంది సంక్రమణ కారణంగా మరణించారు.
- అంటే, దేశంలో చోటుచేసుకున్న మరణాలలో 42.3% మహారాష్ట్రలోనే నమోదయినట్టయింది.
- తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం లో ఏలేరు రిజర్వాయర్ లో స్నానానికి దిగిన నలుగురు విద్యార్థులు.
- అందులో ఇద్దరు మృతి.
- వీరు పెద్దాపురం మహారాణి కళాశాల డిగ్రీ విద్యార్థులు.
- ప్రకాశంజిల్లా, ఎర్రగొండపాలెం మండలం, చెన్నుపల్లి చెంచు గూడెం సమీపంలోని నల్లమల అడవి ప్రాంతంలో పెద్ద పులి మృతి .
- సంఘటన స్థలాన్ని పరిశీలించి వెటర్నరీ డాక్టర్ చేత పంచనామా నిర్వహింహించిన మార్కపురం ఫారెస్ట్ DFO.ఖాదర్ బాషా.
- ఈ పెద్ద పులి వయస్సు 20 సం.ఉంటుంది. ముసలితనంతో చనిపోయిందని DFO షేక్ ఖాదర్ భాష తెలిపారు..
- జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం సమీపంలోని ఎర్రకాల్వ జలాశయం లో ఈతకు దిగి గొల్లపల్లి అన్వేష్ (26) అనే వ్యక్తి గల్లంతు.
- స్నేహితుడి పెండ్లి రోజు సందర్భంగా 15 మంది స్నేహితులు ఎర్ర జలాశయం వద్ద పార్టీ చేసుకునేధందుకు వచ్చి జలాశయంలోకి ఈతకు దిగడంతో ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్న పోలీసులు
- మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు.
- ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి పొందవచ్చు : డీజీపీ
- వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమర్పించాల్సి ఉంటుంది : డీజీపీ
- ఆ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశాం : డీజీపీ
- వాహన యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరు : డీజీపీ