Live Updates: ఈరోజు (11 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 11 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ఏకాదశి రా.8-33 తదుపరి ద్వాదశి | ఉత్తర నక్షత్రం రా.1-33 తదుపరి హస్త | వర్జ్యం ఉ.9-39 నుంచి 11-10 వరకు | అమృత ఘడియలు సా.6-44 నుంచి 8-15 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.11-21 నుంచి 12-06 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-22
ఈరోజు తాజా వార్తలు
విజయవాడ
సీపీ బి.శ్రీనివాసులు
-ధర్నాలు, నిరసనలు చేయుటకు ముందస్తు అనుమతి తప్పనిసరి
-ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించని కార్యక్రమాలకు పోలీసు వారి సహకారం ఉంటుంది
-కమీషనరేట్ పరిధిలో సీఆర్పీసీ సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు
అనంతపురం:
-నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామంలో పురాతన శివాలయాన్ని కూల్చివేసి సచివాలయం నిర్మాణాన్ని చేపట్టిన రెవెన్యూ అధికారులు.
-సచివాలయ నిర్మాణ పనులను స్థానిక బిజెపి నాయకులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి
-నల్లచెరువు మండలం అల్లుగుండు లోని శివాలయానికి వందేళ్ల చరిత్ర ఉంది.
-ఆలయానికి సంబంధించిన 56 సెండ్ల మన్యాన్ని రెవెన్యూ అధికారులు లంచాలు ఆశించి అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నాను.
-ఏపీలో దేవాలయ ఆస్తుల ధ్వంసం, అన్యాక్రాంతం నిరంతరం కొనసాగడాన్ని ఖండిస్తున్నాను.
-జిల్లా అధికారులు పథకం ప్రకారం దేవాలయ భూమి లో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించడాన్ని బీజేపీ ఖండిస్తోంది.
-ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేయాలి. లేకపోతే జరిగే పరిణామాలకు, శాంతిభద్రతలకు ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలి.
కర్నూలు జిల్లా శ్రీశైలం..
-ఈ నెల 16.11.2020 నుండి 14.12.2020 నుండి కార్తీకమాసోత్సవాలు
-కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ కార్తీకమాసోత్సవాల నిర్వహణ
-కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు
-దర్శనానికి విచ్చేసే భక్తులు ముందస్తుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి
-టైమ్స్లాట్ పద్దతిలో అనగా కేటాయించిన నిర్ణీత సమయాలలో దర్శనాలకు అనుమతి
-క్షేత్రానికి విచ్చేసే భక్తులు ముందస్తుగా కోవిడ్ పరీక్షలు చేయించుకొనిరావాలి
-భక్తులు మాస్కును ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం తప్పనిసరి
-ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలు
-10 సంవత్సరాల పై బడి నుండి 65 సంవత్సరాల లోపల వయస్సుగల వారికి మాత్రమే దర్శనాల అనుమతి
-కార్తీకసోమవారాలు, పౌర్ణమిరోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన మరియు పుష్కరిణి హారతి
-నవంబరు 29వ తేదీన జ్వాలాతోరణోత్సవం
-భక్తులు కార్తికదీపారాధనను చేసుకునేందుకు వీలుగా ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాటు
అమరావతి (హైకోర్టు)..
★ చీరాల దళిత యువకుడి మృతి కేసు దర్యాప్తులో పోలీసులు నిబంధనలు పాటించట్లేదని.. కేసును సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ వేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.
★ రాష్ట్రప్రభుత్వం, కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు రికార్డు కాకపోవటంతో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
★ చీరాల దళిత యువకుడి మృతి కేసు దర్యాప్తులో పోలీసులు నిబంధనలు పాటించట్లేదని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
★ ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు రికార్డు కాకపోవటంతో వాటిని రికార్డులోకి ఎక్కించాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
★ తదుపరి విచారణను ఈ నెల17 వ తేదీకి వాయిదా వేసింది.
అమరావతి..
-హజరైన హోంమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు,
-చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, వ్యవసాయశాఖ స్పెషల్ సిఎస్ పూనం మాలకొండయ్య,
-రెవెన్యూశాఖ (డిజాస్టర్ మేనేజిమెంట్) ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి,
-డిజాస్టర్ మేనేజిమెంట్ స్పెషల్ కమీషనర్ కె. కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు
ఆంధ్రప్రదేశ్..
-ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది.
-ఇప్పటికే 7 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోన్న సేవలను మిగిలిన జిల్లాలకు కూడా వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది.
-ఇదివరకే ఆరోగ్యశ్రీలో ఉన్న 2 వేల 2 వందల చికిత్సలకు..మరో 233 చికిత్సలు చేర్చింది ప్రభుత్వం.
-పథకం అమల్లో నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ
- బాజి, బీజేపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు
- నంద్యాలలో ఒక పేద కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం చాలా భాదకరణం.
- దానికి కారణం అయిన వారని కఠినంగా శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి.
- సంఘటన జరిగిన 5 రోజుల తరువాత ఇప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిసింది.
- ఈ అంశం కేవలం ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం కానీ మతానికి సంబంధించింది కాదు.
- విధ్వంసక శక్తులు ప్రజల్లో చేరి మతం ముసుగులో విధ్వంసం చేయడానికీ కుట్రలు జరుగుతున్నాయి.
- ఇప్పటి ప్రభుత్వం అన్ని వర్గాలని కులాల వారిగా మతాల వారిగా విడగొట్టి రాజకీయాలు చేస్తున్నాయి.
- దయచేసి మైనారిటీలతో రాజకీయాలు చేయొద్దు అని బీజేపీ కోరుకుంటుంది.
- అభివృద్ధి పక్కన పెట్టి అరాచకాలు, అక్రమాలు చేస్తున్నాయి.
- ముఖ్యమంత్రి, మంత్రులు, స్థాయి దిగజారి మాట్లాడటం బీజేపీ కండిస్తుంది.
విజయవాడ
- బాజి, బీజేపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు
- నంద్యాలలో ఒక పేద కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం చాలా భాదకరణం.
- దానికి కారణం అయిన వారని కఠినంగా శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి.
- సంఘటన జరిగిన 5 రోజుల తరువాత ఇప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిసింది.
- ఈ అంశం కేవలం ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం కానీ మతానికి సంబంధించింది కాదు.
- విధ్వంసక శక్తులు ప్రజల్లో చేరి మతం ముసుగులో విధ్వంసం చేయడానికీ కుట్రలు జరుగుతున్నాయి.
- ఇప్పటి ప్రభుత్వం అన్ని వర్గాలని కులాల వారిగా మతాల వారిగా విడగొట్టి రాజకీయాలు చేస్తున్నాయి.
- దయచేసి మైనారిటీలతో రాజకీయాలు చేయొద్దు అని బీజేపీ కోరుకుంటుంది.
- అభివృద్ధి పక్కన పెట్టి అరాచకాలు, అక్రమాలు చేస్తున్నాయి.
- ముఖ్యమంత్రి, మంత్రులు, స్థాయి దిగజారి మాట్లాడటం బీజేపీ కండిస్తుంది.
అమరావతి.....
- రాజధాని తరలింపు కేసులపై సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదులకు ఫీజులు చెల్లింపునకు పరిపాలనా అనుమతులు
- సీఆర్డీఏ నుంచి 2 కోట్ల 36 లక్షల 29 వేల రూపాయలను ఏజీ సహా వివిధ సీనియర్ న్యాయవాదులకు చెల్లింపులు చేసేందుకు అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం
గుంటూరు
- మంత్రి రంగనాధ్ రాజు కామెంట్స్...
- ముఖ్యమంత్రి పాదయాత్ర ముగిసి మూడు సంవత్సరాల గడుస్తున్న సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు పర్యటిస్తున్నారు.
- సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందడం పై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- కోవిడ్ రోగులకు అత్యున్నతమైన సేవలు జిజిహెచ్ సిబ్బంది అందించారు.
- ఎన్ జి ఒల సహాయంతో నిర్మించిన భవనాన్ని రోగుల సహాయకులకు వినియోగించమని కోరారు.
- డిశంబర్ నాటికి భవనాన్ని పూర్తి చేసి రోగుల సహాయలకు ఉచితంగా భోజనం పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.
- జిజిహెచ్ ఉన్నంత కాలం ఉచిత భోజన సదుపాయం కొనసాగిస్తాం.
- ముఖ్యమంత్రి జిజిహెచ్ అభివృద్ధి కి మూడు కోట్ల రూపాయలను మంజూరు చేశారు.
- మూడు కోట్ల రూపాయలను తల్లి బిడ్డల వైకర్యాల కల్పనకు వినియోగిస్తాం.