Anantapur District updates: పురాతన శివాలయాన్ని కూల్చివేసి సచివాలయం నిర్మాణాన్ని చేపట్టిన రెవెన్యూ అధికారులు..

అనంతపురం:

-నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామంలో పురాతన శివాలయాన్ని కూల్చివేసి సచివాలయం నిర్మాణాన్ని చేపట్టిన రెవెన్యూ అధికారులు.

-సచివాలయ నిర్మాణ పనులను స్థానిక బిజెపి నాయకులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి

-నల్లచెరువు మండలం అల్లుగుండు లోని శివాలయానికి వందేళ్ల చరిత్ర ఉంది.

-ఆలయానికి సంబంధించిన 56 సెండ్ల మన్యాన్ని రెవెన్యూ అధికారులు లంచాలు ఆశించి అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నాను.

-ఏపీలో దేవాలయ ఆస్తుల ధ్వంసం, అన్యాక్రాంతం నిరంతరం కొనసాగడాన్ని ఖండిస్తున్నాను.

-జిల్లా అధికారులు పథకం ప్రకారం దేవాలయ భూమి లో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించడాన్ని బీజేపీ ఖండిస్తోంది.

-ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేయాలి. లేకపోతే జరిగే పరిణామాలకు, శాంతిభద్రతలకు ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలి.

Update: 2020-11-11 14:40 GMT

Linked news