GHMC నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన చిన్నారి.. నాలాలో పడి మృతి..
Hyderabad Rains: సికింద్రాబాద్లోని కళాసిగూడలో దారుణం చోటు చేసుకుంది.
GHMC నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన చిన్నారి.. నాలాలో పడి మృతి..
Hyderabad Rains: సికింద్రాబాద్లోని కళాసిగూడలో దారుణం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. మ్యాన్హోల్లో పడి ముక్కుపచ్చలారని చిన్నారి మరణించింది. నోరు చెరుచుకున్న నాలాలో పడి నాలుగో తరగతి చదువుతున్న మౌనిక కొట్టుకుపోయింది. పాల ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లింది మౌనిక. కానీ ఎంత సేపైనా ఇంటికి తిరిగి రాలేదు.
దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులను పాపను వెతికే క్రమంలో డీఆర్ఎఫ్ సిబ్బంది నాలాలో కొట్టుకు వచ్చిన పాప మృతదేహాన్ని పార్క్లైన్ దగ్గర కనిపెట్టారు. ఒక్కసారిగా తమ చిన్నారిని విగతజీవిగా చూసి తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. తమ పాప ఇక లేదన్న వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ప్రాంతమంత తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పాప మృతదేహాన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది గాంధీ మాస్పిటల్కు తరలించారు.