హైదరాబాద్ శివార్లలో మందుబాబులు వీరంగం సృష్టించారు. బొంగులూరు టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. కారును పక్కకు తీయమన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయిన మందుబాబులు టోల్ ప్లాజా సిబ్బందిని చితకబాదారు. మందుబాబుల దాడిలో టోల్ ప్లాజా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.