పరువు హత్యకు గురైన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ భార్య అమృతను కించపరిచేలా అసభ్య కామెంట్లు చేసిన యువకున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈశ్వర్(25) అనే యువకుడు ప్రణయ్ హత్య విషయంలో ఫేస్బుక్ వేదికగా అమృత వర్షినిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. దీంతో ఈశ్వర్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.