వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ కార్యాలయం తాళాన్ని పగులగొట్టడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారే తాళం పగులగొట్టారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఎన్నికల అధికారి సతీష్తో కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ కార్యాలయం తాళాన్ని పగులగొట్టిన ఘటనపై విచారణ జరపాలంటూ నర్సంపేటలో భారీ ర్యాలీ చేపట్టారు.