ఎన్నికల్లో వంద సీట్లను సాధించడమే తమ ముందున్న లక్ష్యమని వనపర్తి టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని అంకూర్, వెంకటాపూర్, చిన్న గుంటపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన నిరంజన్రెడ్డికి మహిళల నుంచి పెద్దఎత్తున స్వాగతం లభించింది. టీఆర్ఎస్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని లాభసాటిగా వ్యవసాయం చేసుకుంటున్నారని నిరంజన్రెడ్డి చెప్పారు.