చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభకు ఎన్నికల ప్రచారంలో షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కట్నపల్లిలో ప్రచారానికి వెళ్లిన బోడిగే శోభను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామానికి ఏం చేశారంటూ శోభను నిలదీశారు. దాంతో శోభ అనుచరులకు, గ్రామస్తులకు తీవ్ర వాగ్వాదం జరిగింది.