రానున్న యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు విజయశాంతి. ప్రజా తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అన్నా, చెల్లెల మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం తామంత కలిసి టీమ్ వర్క్ చేస్తున్నామన్నారు విజయశాంతి. సీఎం కేసీఆర్ తనను దేవుడిచ్చిన చెల్లి అన్నారని, ఈ అన్నా, చెల్లెల మధ్య పోరాటానికి ప్రజలే తీర్పు చెబుతారన్నారు. స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు అప్పజెప్పిన తమ అధినేత రాహుల్ గాంధీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చానని, తన గురించి తర్వాత మాట్లాడుతానని చెప్పారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, దాసోజు శ్రవణ్ కుమార్లు పాల్గొన్నారు.