నిజామాబాద్ జిల్లా బోధన్ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న గైనకాలజిస్టు సారికను టీఆర్ఎస్ నేత జమీల్ సైబర్ వేధింపులకు గురి చేస్తున్నాడు. గత రెండేళ్లుగా ఆసుపత్రి స్టాఫ్తో పాటు కింది స్థాయి సిబ్బందిని జమీల్ సైబర్ వేధిస్తున్నాడు. ఆసుపత్రికి వచ్చిన డాక్టర్ సారికను చెప్పకుండా ఎందుకు వచ్చావంటూ బెదిరించాడు. అంతేకాదు నిత్యం ఫోన్లోనూ వేధిస్తున్నట్లు డాక్టర్ సారిక తెలిపింది. టీఆర్ఎస్ నేత వ్యవహారశైలిని నిరసిస్తూ ఆసుపత్రి సిబ్బందితో పాటు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.