రక్తపింజరి కడుపులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 పిల్లలు బయటపడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు విస్తుపోవాల్సి వచ్చింది. కృష్ణాజిల్లా ఉంగుటూరులో బుడమేరు పక్కనే ఉన్న పొలంలో ఈ ఘటన దర్శనమిచ్చింది. నారుమడికి నీరు పెట్టడానికి వచ్చిన రైతుకు సడన్గా రక్తపింజరి కనిపించడంతో వెంటనే చంపేశారు. తర్వాత దాని కడపులోంచి 35 పాము పిల్లలు బయటకు వచ్చాయి. భయాందోళనకు గురై న రైతులు వాటిని కూడా చంపేశారు.