పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌

Update: 2017-12-23 04:42 GMT

తిరుపతి నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయ్‌ మండలం సిర్నాపల్లి దగ్గర ఇంజిన్‌తో పాటు ఓ బోగీ పట్టాలు తప్పాయి. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో అర కిలోమీటర్‌ వరకూ ట్రాక్‌ ధ్వంసం అయింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. పలువురు ప్రయాణికులు భయంతో రైలు దిగిపోయారు. 

Similar News