ప్రజలు నిలదీస్తుంటే ప్రచారం చేయలేకపోతున్నారు: పొన్నం

Update: 2018-11-07 05:26 GMT

టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థుల గురించి మాట్లాడటం కాదని, చేతనైతే మీ సంగతి చూసుకోండని విమర్శించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. 14 సీట్ల కోసం 60 రోజులుగా తేల్చుకోలేకపోయిన టీఆర్‌ఎస్.. కాంగ్రెస్ గురించి మాట్లాడుతుందని మండిపడ్డారు. మహాకూటమి గురించి మాట్లాడే కంటే నాలుగున్నరేళ్లలో జనాన్ని మోసం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నిలదీస్తుంటే ప్రచారం చేయలేక పరువు తీసే విధంగా టీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. 

Similar News