మోత్కుపల్లి నర్సింహులు ధోరణిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ మండిపడ్డారు. పెడితే పెళ్లికి లేదా చావుకు అన్నట్లు మోత్కుపల్లి తీరు వుందని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ వ్యక్తులను చూసి భయపడే పార్టీ కాదని స్పష్టం చేశారు. గతంలో జగన్, పవన్ కల్యాణ్ మీద మోత్కుపల్లి చేసిన తీవ్ర విమర్శలను ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు రమణ. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రానికి పిలిస్తే మోత్కుపల్లి రాలేదని, అప్పటి నుంచి ఏ కార్యక్రమాలకు పిలవలేదని రమణ చెప్పారు.