కాంగ్రెస్ త్యాగాల పునాదులపైనే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. అలాంటి కాంగ్రెస్ పెద్దలపై కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముందస్తుకు వెళ్తున్నారని జానా ఆరోపించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.