హైదరాబాద్లో గ్రూప్2 అభ్యర్థులు రోడ్డెక్కారు. ఏడాది గడుస్తున్నా... నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో ఆగ్రహించిన అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడించేందుకు యత్నించారు.దీంతో పోలీసులు అభ్యర్ధులను అడ్డుకుని... అరెస్ట్ చేసి గోషామహల్ స్టేషన్కు తరలించారు. కోర్టు కేసు కారణం చెబుతూ తమ జీవితాలతో సర్కారు ఆడుకుంటుందని ఆరోపించారు. వెంటనే నియామక ప్రక్రియ చేపట్టాలని లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.