నయీమ్ కేసులో ట్విస్ట్

Update: 2018-07-06 09:52 GMT

నయీమ్ కేసులో వేటు పడిన ఆరుగురిపై సస్పెన్షన్ ఎత్తేశారు. దీంతో వారు ఇవాళ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితమే సస్పెన్షన్ ఎత్తేయగా...ఇవాళ ఆ ఆరుగురు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత ఆరోపణలు రావడంతో ఓ అదనపు ఎస్పీ, మరో ఏసీపీతో పాటు ఇంకో నలుగురిని సస్పెండ్ చేశారు. అయితే ఆ ఆరోపణలు రుజువు కాకపోవడంతో సస్పెన్షన్ ఎత్తేశారు. కాగా కరడుగట్టిన నేరస్తుడు నయీం 2016 సెప్టెంబర్‌లో ఎన్‌కౌంటర్ అయిన విషయం తెలిసిందే.

Similar News