పోలీసు శాఖ నిర్లక్ష్యంతోనే మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగిందని ఆరోపించారు సీపీఐ నేత నారాయణ. అమృత తండ్రితో ప్రమాదం ఉందని ముందే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ప్రణయ్ హత్యకు గురయ్యాడని చెప్పారు. ప్రణయ్, అమృత కుటుంబ సభ్యులను పిలిచి వార్నింగ్ ఇచ్చినట్లయితే ఈ హత్య జరిగి ఉండకపోయేదన్నారు నారాయణ.