నల్లగొండ జిల్లాలో పిడుగుపాటుకు బార్యాభర్తలు చనిపోయారు. మిర్యాలగూడ మండలంలోని అలగడపలో ఈ ఘటన జరిగింది. అలగడప గ్రామానికి చెందిన ఎల్లవుల వెంకయ్య, నారమ్మ పొలాల్లో గొర్రెలను మేపుతుండగా వారిపై పిడుగుపడింది. పిడుగు పాటుకు భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దంపతుల మరణంతో అలగడప గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.