పిడుగుపాటుకు భార్యాభర్తలు మృతి

Update: 2018-06-02 11:18 GMT

నల్లగొండ జిల్లాలో పిడుగుపాటుకు బార్యాభర్తలు చనిపోయారు. మిర్యాలగూడ మండలంలోని అలగడపలో ఈ ఘటన జరిగింది. అలగడప గ్రామానికి చెందిన ఎల్లవుల వెంకయ్య, నారమ్మ పొలాల్లో గొర్రెలను మేపుతుండగా వారిపై పిడుగుపడింది. పిడుగు పాటుకు భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దంపతుల మరణంతో అలగడప గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 

Similar News