రేపు విజయవాడలో పర్యటించనున్న కేసీఆర్‌

Update: 2018-06-27 09:51 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. తెలంగాణ మొక్కులు చెల్లించుకుంటున్న కేసీఆర్‌ ...కనకదుర్గమ్మను దర్శించుకుని ముక్కుపుడక సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులను కేసీఆర్‌ వరుసగా తీర్చుకుంటున్నారు. ఇక తన విజయవాడ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుతో కేసీఆర్ భేటీ కావచ్చని తెలుస్తోంది.  ఇప్పటికే తిరుమల వెంకన్నకు, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి, వరంగల్ భద్రకాళి అమ్మవారికి, కురవి వీరభద్ర స్వామికి పెట్టిన మొక్కులను కేసీఆర్ తీర్చుకున్నారు.

Similar News