మిషన్ భగీరథ దేశంలోనే పెద్ద స్కాం, న్యాయ విచారణ జరగాలి: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
మిషన్ భగీరథ దేశంలోనే అతి పెద్ద స్కామ్ అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి. మిషన్ భగీరథపై న్యాయ విచారణ జరిపించాలన్న జీవన్రెడ్డి....తాగునీరు పేరుతో ప్రభుత్వం 40వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందన్నారు. మిషన్ భగీరఫథ పైప్లైన్ కోసం గ్రామీణ రోడ్లను అడ్డుగోలుగా తవ్వేశారని ఆరోపించారు. మిషన్ కాకతీయతో చెరువులన్ని నిండినపుడు భగీరథ అవసరమేంటన్నారు. కమిషన్ల కోసం మిషన్ భగీరథ పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగించారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ నిధులను మళ్లించి ఆ వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.