తెలంగాణ సర్కార్‌కు కేంద్రం షాక్

Update: 2018-08-10 06:48 GMT

తెలంగాణ సర్కార్‌కు కేంద్రం మరోసారి షాకిచ్చింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో మద్దతు ఇచ్చిన రోజే తెలంగాణకు కేంద్రం షాక్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. కాళేశ్వరం, పాలమూరుకు రెండింట్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలన్న ఎంపీ వినోద్ లేఖకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తర్వాత ఇకపై ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఉండదని తేల్చి చెప్పారు. 

  

Similar News