ఫేస్‌బుక్‌ వేదికగా అమృత పోరాటం

Update: 2018-09-18 06:16 GMT

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తండ్రి కుల దురహంకారం కారణంగా భర్తను పోగొట్టుకున్న అమృత న్యాయం కోసం సామాజిక మాధ్యమం వేదికగా ఉద్యమాన్ని ఆరంభించింది. హత్యకు గురైన భర్త పేరుతో ‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీని సృష్టించింది. ‘ప్రణయ్‌ ఇప్పుడు ఒంటరి కాదు. నాతోపాటు కోట్ల మంది గుండెల్లో బతికే ఉన్నాడు’ అంటూ అమృత తొలి పోస్టు చేసింది. మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని , ఈ దిశగా అందరూ సహకరించాలని కోరింది.

Full View

Similar News