హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది.. సెలవు రోజుకావడంతో సాఫ్ట్వేర్ దంపతులు రమ్య, ప్రవీణ్కుమార్ ద్విచక్రవాహనంపై చిలుకూరి బాలాజీ ఆలయానికి బయలుదేరారు. అయితే గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తా వద్ద ఓ లారీ వీరి వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రమ్య అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రవీణ్కుమార్కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు.