తుళ్లూరులో ఉద్రిక్తత.. రైతుల టెంట్లు లాగేసిన పోలీసులు !

Update: 2020-01-11 05:46 GMT
తుళ్లూరులో ఉద్రిక్తత.. రైతుల టెంట్లు లాగేసిన పోలీసులు !

రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొన్నది. రైతుల దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపుడితో పాటు రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరూ బయటకు రావద్దొంటూ పోలీసులు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

144 సెక్షన్, 30 యాక్టు అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. టెంట్ లను పోలీసులు తొలగించడంపై నిరనసకారులు మండిపడుతున్నారు. పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఇళ్ల నుంచి ఎవరిని బయటకి రానివ్వడం లేదు. కర్ఫ్యూను తలపిస్తుంది. సచివాలయం వెళ్లే ప్రతివ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు, గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. 

Tags:    

Similar News