అసెంబ్లీలో తుది నిర్ణయం ప్రకటించే యోచనలో జగన్ సర్కార్

Update: 2019-12-27 08:45 GMT

త్రివిధ రాజధానులపై నిర్ణయం తీసుకుంటారంటూ ప్రచారం జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. జీఎన్‌‌రావు కమిటీ నివేదికతోపాటు మంత్రి వర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికపై కేబినెట్‌లో రెండు గంటల పాటు చర్చించారు. పరిపాలన వికేంద్రీకరణ దిశగా నియమించిన బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రెండు నివేదికలను అధ్యయనం చేసిన తరువాతే తుది నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ భావిస్తోంది. వచ్చే నెల మూడో వారంలో అసెంబ్లీ నిర్వహించి ఈ మేరకు ప్రకటన చేయాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించింది. 

Tags:    

Similar News