శేరిలింగంపల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. పాకిస్థాన్ నుంచి వచ్చినా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించడం తాము బ్రతికుండగా జరగదంటూ వ్యాఖ్యానించారు. మైనార్టీలను పంపించే పరిస్థితి వస్తే వారికి అండగా ఉంటానన్నారు. మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీజేపీ నేతలు సీఏఏకు ఏజెంట్లుగా పని చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులపై తిరగబడండి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.