Football Fever in Hyderabad: మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్‌కు సీఎం రేవంత్ రెడీ.. హైదరాబాద్​లో రేపే మెస్సీ మ్యాచ్

Football Fever in Hyderabad: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.

Update: 2025-12-12 12:30 GMT

Football Fever in Hyderabad: మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్‌కు సీఎం రేవంత్ రెడీ.. హైదరాబాద్​లో రేపే మెస్సీ మ్యాచ్

Football Fever in Hyderabad: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఫుట్ బాల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కీలక మ్యాచ్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రేపు జరగనుంది. ఈ కీలక మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 39 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియాన్ని నాలుగు సెక్టార్లుగా విభజించారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఫుట్​బాల్​అభిమానులకు పండగే పండగ. ఎందుకంటే ఫుట్​బాల్​ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్​లో మ్యాచ్​ ఆడబోతున్నాడు. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్. దీంతో ఫుట్ బాల్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెస్సీ గోట్​ ఇండియా టూర్ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ మ్యాచ్​లో మెస్సీ, సీఎం రేవంత్​రెడ్డి, అంతర్జాతీయ ఫుట్​బాల్​ క్రీడాకారులు పాల్గొంటున్నారు. మెస్సీ పర్యటన, ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు మెస్సీ శంషాబాద్​విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఫలక్​నుమా ప్యాలెస్​లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉప్పల్​ స్టేడియానికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మ్యూజికల్​కాన్సెర్ట్ ఉంటుంది. రాత్రి 7 గంటలకు చిన్నారులకు మెస్సీ ఫుట్​బాల్ ట్రైనింగ్ ఇస్తారు. అనంతరం, మెస్సీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది.

ఒక్క ఉప్పల్​ స్టేడియంలోనే రాచకొండ పోలీసులు సుమారు 2వేల మందితో బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి అదనంగా స్టేడియం లోపల వెయ్యి మంది వాలంటీర్లు విధుల్లో ఉండనున్నారు. ఉప్పల్​స్టేడియంలో జరిగే మ్యాచ్​కు టికెట్​లు, పాస్​లు ఉన్నవారు మాత్రమే స్టేడియం దగ్గరకు రావాలని రాచకొండ సీపీ సుధీర్​బాబు తెలిపారు. లేనివారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమన్నారు. స్టేడియం దగ్గర రద్దీకి అవకాశం లేకుండా అభిమానులు సహకరించాలని తెలిపారు.

మెస్సీ పరేడ్ చేయడంతో పాటు పెనాల్టీ స్ట్రోక్​కూడా ప్రదర్శిస్తాడు. చివరగా మ్యాచ్​లో విజయం సాధించిన జట్టుకు గోట్​కప్​ను మెస్సీ అందజేస్తాడు. మెస్సీ పర్యటన, సీఎం రేవంత్ రెడ్డి ఈమ్యాచ్ లో పాల్గొనడంతో హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని, రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడకు ప్రోత్సాహం లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News