Karimnagar: పారదర్శకంగా ఫౌండేషనల్ లిటరసీ సర్వే నిర్వహణ

Karimnagar: కరీంనగర్ జిల్లాలోని 8 పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సర్వే (FLS) - 2026 విజయవంతమైంది.

Update: 2026-03-31 13:21 GMT

Karimnagar: పారదర్శకంగా ఫౌండేషనల్ లిటరసీ సర్వే నిర్వహణ

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఎంపిక చేసిన 8 పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సర్వే (FLS) – 2026 విజయవంతంగా నిర్వహించబడింది. ఈ రోజు మొత్తం 40 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా ప్రక్రియ సజావుగా, సమర్థవంతంగా నిర్వహించబడింది.

సంబంధిత మండల విద్యాధికారులు (MEOలు) ఎంపిక చేసిన పాఠశాలలను సందర్శించి FLS నిర్వహణను పర్యవేక్షించారు. అకాడెమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (AMO) శ్రీ కె. అశోక్ రెడ్డి, వేదం మరియు CSI పాఠశాలలను సందర్శించి పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు.

పరీక్షలను పరివేక్షించిన జిల్లా అధికారులు..

ACLB మరియు జిల్లా విద్యాధికారి (DEO) శ్రీమతి అశ్విని తనాజీ వాకడే, IAS గారు కేంద్రీయ విద్యాలయం (KV)ను సందర్శించి పరీక్ష నిర్వహణను సమీక్షించి, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు (FIs) మరియు విద్యార్థులతో పరస్పరం మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మేడమ్‌తో పాటు తిమ్మాపూర్ మండల విద్యాధికారి శ్రీనివాస్ గారు మరియు ప్రిన్సిపాల్ శ్రీ పంకజ్ పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణపై అదనపు కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు.

సాంకేతిక వినియోగంతో పారదర్శకంగా పరీక్షలు..

ఈ పరీక్షను డిజిటల్ ట్యాబ్‌ల ద్వారా నిర్వహించడం వలన ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా పూర్తయ్యింది. సాంకేతిక వినియోగం వల్ల పరీక్షా ప్రక్రియ పారదర్శకంగా సమర్థవంతంగా జరిగింది.పరీక్ష పూర్తైన అనంతరం అన్ని ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు (FIs) ట్యాబ్‌లు మరియు పరీక్షానంతర సామగ్రిని DIET వద్ద సమర్పించారు.

FLS–2026 విజయవంతంగా నిర్వహించబడినందుకు జిల్లా పరిపాలన సంతృప్తిని వ్యక్తం చేసింది.

Tags:    

Similar News