Kamareddy: బాతులు తాగేందుకు ఏర్పాటు చేసిన... నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
Kamareddy: కామారెడ్డి రాజీవ్ నగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. బాతులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టెలో పడి బాలుడు చనిపోయాడు.
Kamareddy: బాతులు తాగేందుకు ఏర్పాటు చేసిన... నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
Kamareddy: కామారెడ్డి రాజీవ్ నగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. బాతులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టెలో పడి బాలుడు చనిపోయాడు. బుద్ద భాస్కర్ తన కుటుంబంతో కలిసి ఓ ఫామ్ హౌజ్ వద్ద కాపాలా కూలీగా పనులు చేసుకుంటున్నారు. అక్కడ బాతులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన చిన్న తొట్టి ఉంది. వారి కుమారుడు రన్విత్ కుమార్ బాతుల వెనుక వెళ్లి ప్రమాదవశాత్తు తొట్టిలో పడిపోయాడు. తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాలుడు చనిపోయినట్లు తెలిపారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.