దిశా కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో..
దిశ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దిశ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో 12 మంది పోలీస్ అధికారులతో సిట్ ఏర్పాటైంది.
శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి నేతృత్వంలో నలుగురు అడిషనల్ డీసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలను నియమించారు. కస్టడీ పూర్తైన మరుక్షణమే ఫాస్ట్ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన పోలీసులు కస్టడీలో నిందితులు ఇచ్చే సమాచారాన్ని కేస్ రీ కన్స్ట్రక్షన్ వివరాలన్నీంటిని చార్జిషీట్లో పొందుపర్చేందుకు సిద్ధమవుతున్నారు.