Kompalli: ఏడో తరగతి విద్యార్థిపై దాడి చేయించిన ప్రధానోపాధ్యాయుడు.. !
Kompalli: కుత్బుల్లాపూర్లో దారుణం చోటు చేసుకుంది. కొంపల్లి ప్రభుత్వ స్కూల్లో 7 తరగతి చదువుతున్న విద్యార్థిపై 10వ తరగతి విద్యార్థులు దాడి చేశారు.
Kompalli: కుత్బుల్లాపూర్లో దారుణం చోటు చేసుకుంది. కొంపల్లి ప్రభుత్వ స్కూల్లో 7 తరగతి చదువుతున్న విద్యార్థిపై 10వ తరగతి విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో విద్యార్థికి గాయాలయ్యాయి. విద్యార్థి ప్రధానోపాధ్యాయుడు కృష్ణ చెప్పిన మాట వినకపోవడంతో.. 10వ తరగతి విద్యార్థులతో ప్రధానోపాధ్యాయుడు దాడి చేయించాడని విద్యార్థి తండ్రి ఆరోపణలు చేశారు. విద్యార్థి తండ్రి పేట్ బషీరాబాద్ పోలీస్లకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.