Karimnagar: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అంగన్‌వాడీలు

Karimnagar: కరీంనగర్ కోతిరాంపూర్ అంగన్‌వాడీ సెంటర్‌లో 'ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ప్రీ స్కూల్ మేళా నిర్వహించారు.

Update: 2026-03-30 12:13 GMT

Karimnagar: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అంగన్‌వాడీలు

కరీంనగర్: ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక లొ భాగంగా కోతిరాంపూర్ అంగన్వాడీ సెంటర్లొ ప్రీ స్కూల్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా RDO మహేశ్వర్ జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి CDPO సబితా 39 డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్ మరియు 9 డివిజన్ కార్పొరేటర్ పాడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వల చేశారు.

ఈ సందర్భంగా RDO మహేశ్వర్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్కు దీడుగా అంగన్వాడీ స్కూల్ పనిచేస్తున్నాయి. ఆట పాటలతో విద్య ను బోధించడం జరుగుతుంది అని చెప్పారు. DWO సరస్వతి మాట్లాడుతూ గర్భవత్తులు బాలింతలు అంగన్వాడీ సెంటర్ లొ లభించే పౌష్టికహారం బాలామృతం తీసుకోవాలని సూచించారు.

పోషకాహారం పై అవగాహన పెంచుకోవాలి..

సీడీపీఓ సబితా మాట్లాడుతూ ప్రీ స్కూల్ ప్రాధాన్యత, మొదటి 1000 రోజుల లో తీసుకోవాల్సిన జాగ్రత్త, పోషకహారం గురుంచి తల్లులకు అవగాహనా కల్పించారు.పి & జి ప్రతం మాస్టర్ ట్రయినర్ రాజేందర్ పిల్లలకు ఐదు అభివృద్ధి ల పైన ఆటలు ఆడించారు. దాదాపు 200 మంది పిల్లలు ఆటలు, పాటలు, కథ, సంభాషణ, పూర్వ గణిత భావనలు తల్లి తండ్రులను మంత్ర ముగ్దలను చేసాయి.

భాష, మేధా, సాంఘిక అభివృద్ధి, సృజనత్మాకత గురించి పిల్లలకు వివరిస్తూ వారికీ రిపోర్ట్ కార్డు సీడీపీఓ సబితా సూపెర్వైసోర్ అరుణ నిర్మల రేణుక చేతుల మీద అందించడం జరిగింది. preschool వస్తువుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమం లో సతీష్ టీచర్స్ స్వరూప, శ్యామల, సరిత పిల్లలు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News