పోలీసులపై పూలవర్షం కురిపించిన జనం

Update: 2019-12-06 04:51 GMT

షాద్‌నగర్ పట్టణ శివారులోని చటాన్‌పల్లి వద్ద దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన నేపథ్యంలో జనాలు తండోపతండాలుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులను ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ పోలీసులు జిందాబాద్‌ అంటూ పూల వర్షం కురిపిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ ద్వారా సరైన సమాధానం చెప్పారంటూ స్థానికులు వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News