Mulugu District: పోలీస్ ఇన్‌ఫార్మర్‌ నెపంతో గోపాల్ అనే వ్యక్తి హత్య..!

* ఘటనా స్థలంలో లేఖను వదిలి వెళ్లిన మావోయిస్టులు

Update: 2022-11-10 02:45 GMT

 పోలీస్ ఇన్‌ఫార్మర్‌ నెపంతో గోపాల్ అనే వ్యక్తి హత్య

Atrocity in Mulugu District: ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపురం గ్రామంలో అర్ధరాత్రి గోపాల్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తు్న్నాడంటూ మావోయిస్టులు గోపాల్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో మావోయిస్టులు లేఖను వదిలివెళ్లారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ గోపాల్ తన పద్ధతి మార్చుకోకపోవడంతోనే హతమార్చినట్లు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

Similar News