దిశ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై షాద్నగర్ కోర్టు ఇవాళ తుది నిర్ణయం ప్రకటించనుంది. శాంతి భద్రతల దృష్ట్యా నలుగురు నిందితులను చర్లపల్లి జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చర్లపల్లి జైలు అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ సిద్ధం చేసుకోవాలని షాద్నగర్ కోర్టు సూచించినట్లు సమాచారం.
దిశ కేసులో నిందితులకు షాద్నగర్ పోలీసులు నోటీసులు జారీ చేసి, వారి సంతకాలు తీసుకున్నారు. నిందితుల సంతకాలతో ఉన్న పేపర్లను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రేపు కోర్టు తీర్పు అనంతరం, నలుగురు నిందితులను షాద్నగర్ పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నారు. కస్టడీ పిటిషన్పై నిందితుల సమాచారం గోప్యంగా ఉంచుతున్నారు.