Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,178 కరొనా పాజిటివ్ కేసులు నమోదు!

Coronavirus Updates in Telangana: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.. ఇక శనివారం కొత్తగా రాష్ట్రంలో 1,178 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి.

Update: 2020-07-11 16:31 GMT
Coronavirus Updates in Telangana

 Coronavirus Updates in Telangana: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.. ఇక శనివారం కొత్తగా రాష్ట్రంలో 1,178 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 33,402 కు చేరుకుంది. ఇక కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 9 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 348 కు చేరింది. గురువారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 736 కేసులు వచ్చాయి.

ఇక మిగిలిన జిల్లాలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 101, కరీంనగర్ జిల్లాలో 24, సంగారెడ్డిలో 13, వరంగల్ అర్బన్ 20, మెదక్ 16, యదాద్రి 9, పెద్దపల్లి, మహబూబ్ నగర్ , నల్గొండ , నిజామాబాద్ జిల్లాలలో 12, రాజన్న సిరిసిల్లా 24, సిద్దిపేట 9, ఆదిలాబాద్ 9, సూర్యపేట 6, గద్వాల్ 6, వికారాబాద్ 9, నారాయణపేట, మంచిర్యాల్ జిల్లాలలో 5, ఖమ్మం, వరంగల్ రూరల్ , నిర్మల్, వనపర్తి లలో 2, ఆసిఫాబాద్ లో ఒక్కో కేసు నమోదు అయినట్టుగా శనివారం వైద్య ఆరోగ్య శాఖ గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.

ఇక కొత్తగా 1,714 మంది కోలుకోవడంతో ఇప్పటివరకూ మొత్తం 20,919 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,135 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఇక గురువారం కొత్తగా 11,062మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,62, 171 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే గత వారం రోజులుగా కరోనా నుంచి కోలుకొని పెద్ద సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవ్వడం సంతోషాన్ని కలిగిస్తుంది.

కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. ఇక కరోనాని మరింతగా కట్టడికి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మేంట్ జోన్లలో ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ని పొడిగించింది.



 


Tags:    

Similar News