గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొదుతున్న కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించి మంత్రి ఈటల రాజేందర్ బాధితుడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో పాజిటివ్ వచ్చిన క్షణం నుంచి ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు 24 గంటలు పని చేస్తున్నామన్నారు.
పాజిటివ్ వ్యక్తి తో పాటు కరోనా వైరస్ అనుమానం తో పరీక్షలు చేయించుకోవడానికి వచ్చి వార్డులో ఉన్న వారితో కూడా స్వయంగా మాట్లాడిన మంత్రి సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమొద్దన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి శానిటేషన్ సిబ్బంది లిఫ్ట్ లను, వార్డ్ లను శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.