రేపు మీడియా ముందుకు వైఎస్ విజయమ్మ

Update: 2018-11-10 10:58 GMT

విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై దాడి తర్వాత తొలిసారిగా ఆయన కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రానున్నారు. రేపు ఉదయం వైఎస్ విజయమ్మ మీడియా ముందుకు రానున్నారు. జగన్ పై దాడి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై విజయమ్మ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. దాడి నుంచి కోలుకుంటున్న జగన్ రేపు రాత్రికి విశాఖపట్నం చేరుకోనున్నారు. ఎల్లుండి నుంచి విజయనగరంలో ప్రజా సంకల్పయాత్రను కొనసాగించనున్నారు. ఇప్పటి వరకూ  వైఎస్‌ జగన్‌ 294 రోజులుపాటు పాదయాత్ర చేశారు. 
 

Similar News