రేపటి జగన్‌ పాదయాత్ర వాయిదా

Update: 2018-11-02 07:10 GMT

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడి నుంచి జగన్‌ ఇంకా కోలుకోలేదు. భుజానికి గాయం కారణంగా లోపలి కండరాలు మానలేదు. గాయం మానడానికి మూడు వారాల సమయం పట్టే అవకాశముందని అప్పటి వరకు కుట్లు అలాగే ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గాయం పూర్తిగా మానే వరకు రెస్ట్‌ తీసుకోవాలని సూచించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జగన్‌ ప్రజాసంకల్పయాత్ర రేపటి నుంచి కొనసాగించాల్సి ఉంది. అయితే, గాయం ఇంకా మానకపోవడంతో వారం రోజుల రెస్ట్‌ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో విజయనగరం జిల్లాలో జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర ఈ నెల 10 తర్వాత నుండి ప్రారంభమయ్యే అవకాశముంది.

Similar News