చంద్రబాబు సీఎం ఐతే చాలు.. ఆ ఫ్యాక్టరీలు మూతబడతాయి!

Update: 2018-01-08 13:02 GMT

చంద్రబాబు తన సొంత కంపెనీ లాభాల కోసం చిత్తూరు డైరీని.. పధకం ప్రకారమే మూసివేయించారని జగన్‌ ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర  పూతలపట్టుకు చేరింది. హెరిటేజ్‌ ఫ్యాక్టరీ కోసమే దుర్భుద్ధితో చంద్రబాబు దగ్గర ఉండి, చిత్తూరు డైరీని మూసేసే పరిస్థితి తెచ్చారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయితే చాలు.. సహకార రంగంలోని ఫ్యాక్టరీలు మూతబడుతాయని, అందుకు నిదర్శనం చిత్తూరు జిల్లాలోని చక్కర ఫ్యాక్టరీలేనన్నారు. 

Similar News