ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. నేడు ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన రంగారెడ్డి అనే వైసీపీ కార్యకర్త గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.