ఏపి సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్పై దాడి జరిగితే ఇప్పటివరకు విచారణ లేదని విమర్శించారు. కాల్డేటా బయటపెడితే అసలు నిందితులు బయటకు వస్తారన్న ఆయన రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు భ్రష్టుపట్టించారు మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసమే టీడీపీ కాంగ్రెస్తో జతకడుతుందని కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకున్న ఏకైక పార్టీ వైసీపేనన్నారు.