హైదరాబాద్ బంజారాహిల్స్లో దారుణం చోటుచేసుకుంది. బంజారాహిల్స్లో సమీరా అనే యువతిని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. పబ్లో ఉండగా యువతిపై బ్లేడ్తో దాడి చేసి కిడ్నాప్కు పాల్పడ్డాడు. ఇందుకు అతని గర్ల ఫ్రెండ్ కూడా సహకరించింది. కిడ్నాప్ అనంతరం తన ఇంట్లో యువతిని నిర్భంధించాడు. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిరోజ్, అతని గర్ల్ ఫ్రెండ్ కీర్తి కిడ్నాప్కు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఇరువురిపై పలు సెక్లస్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.